Friday, May 1, 2015

మందు సూదనా, పాలకులు, దోపిడీదారులూ, దుర్మాగవర్తనలు కు ప్రాంతమో, మతమో, కులమో అన్న విభేదాలు నీలాగా ఉండవు స్వామీ,!

కోటి ఉమెన్స్ కాలేజీ ఎదుట సెల్ టవర్ హోర్డింగ్ ఎక్కిన తెలంగాణా జాక్ విద్యార్ధులు, నాచారం ఇండస్ట్రియల్ ఏరియా లో సుప్రబాత్ అనే కాలేజీ+స్కూల్ ఏర్పాటు పైన నిరసన, అధికారి పైన చెర్యలు తీసుకోవాలి అని డిమాండ్.
ఈ వార్త వినగానే నాకు 3 ప్రశ్నలు
1. ఈ ల్యాండ్ సుప్రబాత్ సంస్థకు ఎప్పుడు కేటాయించారు. ఆంధ్ర పాలకుల సమయములోనా, తెలంగాణా పాలకుల సమయములోనా?
2. ఈ సంస్థకు ల్యాండ్ కేటాయించిన అధికారి ఎవరు, ఆంధ్ర అతనా, తెలంగాణా అతనా?
3. సుప్రబాత్ సంస్థ ఎవరిది, ఆంధ్ర పెట్టుబడి దారులదా, తెలంగాణా దొరలదా.

విద్యార్ధులు దిగి వస్తారా, విద్యార్ధుల డిమాండ్ లో సహేతుక ఎంత అని ఆలోచించే ముందు ఈ ప్రశ్నలు రావటం నాకు సిగ్గుగా అనిపించినా, ఈ వార్తను చుసిన చాలా మంది మిత్రులు ఇరు వైపులా కుడా ఇలాంటి ప్రశ్నలే అలోచించి ఉంటారు. నా లాగా చెప్పుకోటానికి మొహమాట పడి ఉంటారు.
బాధ్యతగా మెదలల్సిన నాయకులూ, బాద్యత మరిచి నోటి కోచ్చినది వాగి, ప్రజల్లో విషం నింపితే, ప్రజల ఆలోచన ఇలాగే మారుతుంది, అనే దానికి ఇదో ఉదాహరణ.

మన ఆలోచనని ప్రభావితం చేసే నాయకత్వ బాద్యత లేకపోవటం, వాళ్ళను నాయకులూ అని మనం భుజాన మొయ్యటం మన దరిద్రం.

----------------------
అన్నిటికంటే వాళ్లకు కాల్మొక్కే సంస్క్రుతి ని వీడలేని మందు సూదన లాంటి ఏడుపుగొట్టు గాళ్ల మెంటాలిటీ మరింత దరిద్రం. 

మందు సూదనా, పాలకులు, దోపిడీదారులూ, దుర్మాగవర్తనలు కు ప్రాంతమో, మతమో, కులమో అన్న విభేదాలు నీలాగా ఉండవు స్వామీ,!  అది తెలుసుకోలేకపోయి, సొల్లు కబుర్లు చెప్పే నీ అజ్ఞానపు ఏడుపులకు నా సానుభూతి!



p.s. చివరాఖరి ముక్క తప్పితే అంతా మిత్రుడు కిరణ్ ముఖ పుస్తకం నుండి ఎత్తిపోత. 

No comments:

Post a Comment