Monday, July 28, 2025

జగన్‌కు బాబు సహకారం!

 జగన్‌కు బాబు సహకారం, చూస్తుంటే నిజమే అనిపిస్తుంది!

హూ కిల్డ్‌ బాబాయ్? ప్రతి ఎన్నికల సభలో చంద్రబాబు వేసిన ప్రశ్న ఇది. 
ఎన్నికలు జరిగి ఏడాది గడిచింది. హూ కిల్డ్‌ అనే సమాధానం చెప్పవలసిన ముఖ్యమంత్రి ఆ విషయమే మరిచిపోయాడు.

అవినాష్‌రెడ్డి అరెస్ట్‌కు సిబిఐ అధికారులు కర్నూలు వెళ్తే, మొత్తం పోలీసు యంత్రాంగం అడ్డం నిలబడింది. ఇదేమి అరాచకమని గోల చేశాడు చంద్రబాబు.
ఈ సంవత్సర కాలంలో అవినాష్‌రెడ్డి అరెస్ట్‌ అనే ప్రయత్నమే చేయలేదు.

స్మార్ట్‌ మీటర్‌ అంటే రైతు మెడకు ఉరితాడు అని ఉద్యమం చేసింది తెలుగుదేశం పార్టీ. అధికారంలోకి రాగానే స్మార్ట్‌ మీటర్లు బిగించే కార్యక్రమానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నది. కమ్యూనిస్టులు తప్ప మరొకరెవరూ పట్టించుకోవడం లేదు.

షిర్డి సాయి ఎలక్ట్రికల్‌ కంపెనీ విద్యుత్‌ శాఖను దోపిడీ చేస్తున్నదని, తెలంగాణాకు 80వేల రూపాయల ధరకు సరఫరా చేసిన ట్రాన్స్‌ఫార్మర్‌ను ఆంధ్రలో రెండు లక్షల రూపాయల ధరకు కొన్నారని తెలుగుదేశం పార్టీ పెద్దఎత్తున ఆందోళన చేసింది. కానీ అధికారంలోకి వచ్చిన ఈ ఏడాది కాలంలో 2 వేల కోట్ల రూపాయల విలువైన ట్రాన్స్‌ఫార్మర్లు, ఇతర పరికరాలు, అదే ధరలకు కొన్నది చంద్రబాబు ప్రభుత్వం.

మద్యం కుంభకోణంపై దర్యాప్తుకు ఫిబ్రవరిలో సిట్‌ నియమితమైంది. దానిలో కీలక పాత్ర అని జగమంతా తెలిసిన పెద్దిరెడ్డి మిధున్‌రెడ్డిని ఇప్పుడు అరెస్ట్‌ చేశారు. ఈ ఆరు నెలల వ్యవధిలో ట్రైల్‌ కోర్టు నుంచి సుప్రీంకోర్టు వరకు అన్ని న్యాయస్థానాలలో బెయిల్‌ కోసం ప్రయత్నం చేశాడు మిధున్‌రెడ్డి. ఎక్కడ ఉపశమనం దొరకని పరిస్థితిలో అరెస్ట్‌ జరిగింది.
మిధున్‌రెడ్డికి ఇంతకాలం అవకాశాలు ఇవ్వడం వెనుక రాజకీయ లాలూచీతనం లేదని భావించగలమా?

తాడేపల్లిలోని జగన్‌ ఇంటి ప్రహరీకి కోట్లు ఖర్చు పెట్టి కంచె వేశారు. మరికొన్ని కోట్ల రూపాయల విలువైన ఫర్నీచర్‌ కూడా వుంది. పాతిక లక్షల విలువ కూడా చేయని ఫర్నీచర్‌ తిరిగి ఇవ్వలేదని కోడెల శివప్రసాద్‌ మీద చోరీ కేసు పెట్టాడు జగన్‌. దానితోనే ఆయన ఆత్మ హత్య చేసుకొన్నాడు. కానీ కోట్ల విలువైన ప్రభుత్వ ఆస్తిని తన వద్దే పెట్టుకొన్న జగన్‌ జోలికి వెళ్లలేక పోతున్నాడు చంద్రబాబు.కనీసం ఆ వస్తువులు వెనక్కు తెప్పించలేదు. 

కరేడులో ఇండోసోల్‌ కంపెనీ జగన్‌ బినామీ అని, దానికి వేల ఎకరాల భూమి ఇవ్వడానికి లేదని ఎన్నికల ప్రచార సభలలో ఆవేశపూరితంగా మాట్లాడాడు చంద్రబాబు.
ఇప్పుడు జగన్‌ ఇస్తానన్న దానికి రెట్టింపుగా, 8వేల ఎకరాల భూమి ఇస్తున్నాడు. 

అప్పుడు, ఇప్పుడు కూడా అది జగన్‌ బినామీ కంపెనీ. ఇదేమి అన్యాయమని కొందరు మంత్రులు క్యాబినెట్‌ సమావేశంలో అభ్యంతరం చెప్తే, నోరు మూసుకోమని గద్దించాడు.

జగన్‌ హయాంలో విద్యుత్‌ శాఖ అధికారిగా వేల కోట్ల దోపిడీకి సహకరించిన ఐఎఎస్‌ అధికారికి ఛీఫ్‌ సెక్రటరీ ప్రమోషన్‌ ఇచ్చాడు చంద్రబాబు. చేసిన పాపాలన్నీ ఆ ఒక్క పదోన్నతితో తుడిచి పెట్టుకపోయాయి.
జగన్‌తో అంటకాగిన చాలామంది అధికారులు ఇప్పుడు చంద్రబాబు అంతరంగికులుగా మారారు. 

ఎన్నికల సమయంలో ఫోన్‌ చేసినా బదులు చెప్పలేదని మేఘా కృష్ణారెడ్డి మీద రుస రుస లాడాడు చంద్రబాబు. కానీ ఇప్పుడు అదే మేఘా కృష్ణారెడ్డి కోసం బనకచర్ల ప్రాజెక్ట్‌ ప్రతిపాదనను ఆచరణలో పెట్టడానికి ఢిల్లీకి వెళ్లి, ప్రయత్నం చేస్తున్నాడు. 

ఇట్లా చెప్పుకొంటూ పోతే వంద ఉదాహరణలు కన్పిస్తున్నాయి. వీటి భావమేమి తిరుమలేశా? 

ప్రతి తెలుగుదేశం కార్యకర్త మనసును తొలుస్తున్న ప్రశ్న ఇది.


మద్యం కుంభకోణంపై దర్యాప్తు, వైకాపా నాయకులను వరసబెట్టి అరెస్ట్‌ చేయడం, జగన్‌ ఒక క్రిమినల్‌, జాగ్రత్తగా వుండాలని చంద్రబాబు తరచు చేస్తున్న ప్రకటనలు, ‘సాక్షి’ పత్రికలో తెలుగుదేశం ప్రభుత్వాన్ని విమర్శిస్తున్న తీరు చూస్తే, రెండు పార్టీల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుందన్న అభిప్రాయం ప్రజలలో వుంది. 

జగన్‌ను అరెస్ట్‌ చేస్తారనే ప్రచారం కూడా జోరు నడుస్తూ వుంది. అయితే ఇప్పటివరకు ప్రభుత్వం చేపట్టిన వందలాది కేసులు, అరెస్టులలో నేరుగా జగన్‌కు నొప్పి కల్గించే అంశం ఒక్క మద్యం కుంభకోణం మాత్రమే. 

తతిమావన్నీ ఆ పార్టీ నేతలు, వారితో అంట కాగిన అధికారులకు పరిమితం. ఎక్కడైతే జగన్‌ స్వయంగా బాధపడతాడో, అక్కడ ప్రభుత్వం చాలా మృదువుగా వ్యవహరిస్తున్నది. ఈ ఏడాది కాలంలో జరిగిన పరిణామాలలో దీన్ని విశ్లేషించినా అర్ధమయ్యే నిజమిది. 

మేఘా కృష్ణారెడ్డి, షిర్డి సాయి విశ్వేశ్వరరెడ్డి వంటి బడా సంపన్నులు అటు చంద్రబాబు, ఇటు జగన్ల మధ్య వారధి వలె పని చేస్తున్నారన్న అనుమానం సర్వత్రా వ్యక్తమౌతున్నది. ఈ సంపన్నులు అప్పుడు జగన్‌ హయాంలో చేసిన దోపిడీల జోలికి చంద్రబాబు వెళ్లడం లేదు. 

పైగా ఇప్పుడు కూడా వారు రెట్టించిన ఉత్సాహంతో ప్రజాధనం పీల్చుకొని తినే అవకాశం కల్పిస్తున్నారు. దీని అర్ధం రేపు ఒకవేళ జగన్‌ మళ్లీ అధికారంలోకి వస్తే ఈ దోపిడీ వూసెత్తడని. 

ఇతరత్రా ఎట్లా నడచుకొన్నా, కనీసం వైఎస్‌ వివేకా హత్య కేసు దర్యాప్తు విషయంలో చంద్రబాబు ప్రభుత్వం చిత్తశుద్ధితో వ్యవహరించి వుంటే, ఇవన్నీ అపనిందలని కొట్టిపారేయడానికి ఆస్కారం వుండేది. 

 దానితోపాటు జగన్‌ ఏ కోర్టు విచారణకు హాజరు కాకున్నా, న్యాయశాఖ, పిపిలు మౌనంగా వుండిపోవడం అనుమానాలకు మరింత ఊతమిస్తున్నది. 

సిబిఐ కేసులు సరే, కోడి కత్తి శీను కేసుకు కూడా జగన్‌ హాజరు కావడం లేదు. పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ అదేమని ప్రశ్నించడం లేదు.  

సాధారణ వ్యక్తులు ఒక వాయిదాకు రాకున్నా అరెస్ట్‌ వారెంట్‌ ఇచ్చే న్యాయస్థానాలు జగన్‌కు మాత్రం ఏళ్ల తరబడి మినహాయింపు ఇస్తున్నాయి. ప్రభుత్వ పరంగా ఈ దురన్యాయాన్ని సరిదిద్దే ప్రయత్నం లేదు. దీని భావమేమి? 


చంద్రబాబు, జగన్‌లు పైకి మాత్రం బద్ధ శత్రువులుగా ప్రజలను నమ్మించే ప్రకటనలు చేస్తూ, అంతర్గతంగా ఒకరికొకరు సహకరించుకొనే వైఖరితో రాజకీయం చేస్తున్నారని ప్రజలు నమ్మడానికి చాలా ఆధారాలు కన్పిస్తున్నాయి...

పైన వ్రాత , జమీన్ రైతు పత్రిక  దోలేంద్ర ప్రసాద్ గారు. 

Monday, July 7, 2025

మళ్ళీ ఈ తెలుగు నేలలో మాత్రం పుట్టకు మహా మేతా🙏

 అనంతలో లేపాక్షి భూములు, ఓబుళాపురం గనులు, ఎంఎల్ఏ హత్య!

కడపలో బ్రాహ్మిణి స్టీల్స్ స్వాహాలు!

శ్రీకాకుళంలో కొవ్వాడ కాల్పులు!

విశాఖలో బీచ్ సాండ్!

ఖమ్మంలో ముదిగొండ కాల్పులు!

ప్రకాశం, గుంటూరు తీరప్రాంతం లో వాన్ పిక్ భూములు!

మహబూబ్ నగర్లో జడ్చర్ల సెజ్ భూములు!

రంగారెడ్డిలో ఔటర్ మెలికలు!

హైదరాద్ లో పంజాగుట్ట ఫ్లై ఓవర్ కమిషన్లు!

గుంటూరు లో సరస్వతి సిమెంట్స్!

కృష్ణాలో అయేషామీరా హత్య మేనేజ్మెంట్ లాంటి ఘాతకాలు!

వైజాగ్లో ఫార్మా భూములు 

అన్నిటికీ మించి ఒక “#జాతిరత్నాన్ని (రాచ కురుపు)ఈ రాష్ట్రం మీదకు రుద్దిన… 

మహా మేతా ….. తెలుగు నెలంతా నీ అడుగు జాడలే!

ఎన్ని వేల కిలోమీటర్లు అడుగులు వేశావో అంతకు రెట్టింపు పైన భూములు కబ్జాలు చేయించి ఈ తెలుగు రాష్ట్రాలకు కబ్జాల తెగులు పట్టించిన ఒకేఒక్క మహామేత…

తెలుగు నేలంతా నీ అడుగుల #బురద ఇంకా పోలేదు రాజన్నా… 

ఆ బురదకి నీ కొడుకు #మురుగు కూడా తోడై

గంజాయి,చీప్ లిక్కర్,బ్లేడ్ బ్యాచ్ లతో జనాలు హద్దుల్లేని సంతోషంతో వుండేవారు ఏడాది  కిందటి వరకు….ఇవన్నీ సూడకుండా పీస్ పీస్ అయిపోయి యాడకి బోయినావు రాజనాలన్న!

..

యాడ పుట్టినా ఓకే కానీ మళ్ళీ ఈ తెలుగు నేల మీద మాత్రం పుట్టకు రాజనాలన్నా... !!





Thursday, May 8, 2025

పావలాయిజం అంటే చెవి కోసుకొనే భక్తులకోసం!

పావలా లో ఉన్న రెండు బేడ లు కొట్టేసుకొంటూ ఉంటే బహు చూడముచ్చటగా ఉంది🤣🤣, చూడండి, ఆనందించండి.  పావలా భక్తులు ఎవరయినా ఈ అరాచకానికి వివరణ ఇస్తే చూడాలని ఉంది! 





Tuesday, March 18, 2025

పచ్చ తమ్ముళ్లు ఇప్పుడేమంటారు?

షిర్డీ సాయి ఎలెక్ట్రికల్స్ మీద  ప్రతిపక్షం లో ఉండగా తెదేపా పార్టీ సంధించిన ప్రశ్నలు, లేవనెత్తిన అనుమానాలు ఇవి. సహేతుకమైనవే. 










ఇప్పుడు అదే కంపెనీకి వేల ఎకరాలు కేటాయించారు, ఎలా? అంటే అప్పుడు చేసిన ఆరోపణలు తప్పా? లేక మూటలు అందాల్సినవారికి అందినాయా? 

మా సెంద్రబాబు కడిగిన ముత్యం అని చెప్పుకొని తిరిగే పచ్చ తమ్ముళ్లు దీనిని ఎలా సమర్థిస్తారు? బాబూ, కొడుకులు మూటలు సంపాదించటం లో బిజీగా ఉంటున్నారు, కార్యకర్తలను పట్టించుకోకుండా అనే  జనాభిప్రాయానికి ఇది ప్రూఫ్ కాదా?
 ప్రశ్నిస్తా, ప్రశ్నిస్తా అంటూ చొక్కా బటన్స్ విప్పుకొని తిరిగే పవన్ బాబా/ సకలశాఖామంత్రి గా ఫీల్ అయ్యే ఉపముఖ్యమంత్రి , ఆయనను వెన్కవేసుకొచ్చే  కల్ట్ సైనికులు ఇప్పుడేమంటారు? ఇందులో ఆయన వాటా ఎంత?



Saturday, March 15, 2025

జనసేన పూనకాలు!

రాజకీయ పార్టీ మీటింగు లలో,  జనాలుకు పూనకాలు రావటం సహజమే అయినా, సరదాకి వాటి మీద ఓ వైసిపి కి, టీడీపీ కి  చెందిన వాట్సాప్ గ్రూప్ లలో  కామెంట్స్! 


పిఠాపురం లో పవన్కళ్యాణ్ గెలుపు కు కారణం ఎవరూ కాదు (indirect గా వర్మ మీద సెటైర్స్) - నాగబాబు 

పవన్ గెలుపులో వర్మ ప్రమేయం లేదంటే... టీడీపీ గెలుపులో పవన్ ప్రమేయం లేనట్టే గా.. ఇంత సిన్న లాజిక్ ఎలా మిస్ అయ్యారు

  ఓట్లు వేయించుకొనే ముందు ఓడ మల్లన, వేయించుకొన్నాక బోడి మల్లన అంటూ ఈ వీడియో, ఈ స్నేక్ బాబు మారడు అంటూ సెటైర్లు 



మనం నిలబడటమే కాకుండా, నాలుగు దశాబ్దాల తెదేపా ను నిలిబెట్టాం - పవన్కళ్యాణ్ 

 స్నేక్ బాబు నోటి విరోచనాలు సంగతి తెలిసిందే, మీ నోటి దూల ఏమిటి? మీరు మీ నోటితో ఎన్నికల ముందు మాట్లాడిన మాటలు ఓ పాలి  ఆలకించండి.  ముందు గట్టిగా ఓ అయిదు  నిమిషాలు కుర్చీ  పట్టుకోకుండా నించో లేరు కానీ....  


నెల తక్కువ, బుర్ర తక్కువ బాలుడు ఒకడు ఉన్నాడు...వాడు బలం లేకపోయినా ప్రప నేత హోదా ఇవ్వాలని గోల. వీడు నెల తక్కువ, బుర్ర తక్కువ, సిగ్గు తక్కువ వెధవ. మొదటి సారి ఎమ్మెల్యే గా గెలవగానే, నెక్ట్ ప్రధాని నేనే అనుకుంటూ ఉంటాడు 

పవన్ కళ్యాణ్ పుట్టేప్పుడు మా అమ్మకి నొప్పులే రాలేదు - నాగబాబు  

  వీడు పుటకే భారం అని ఇండైరెక్ట్ గా చెప్పినట్టుంది ఆమె!  

నెలలు నిండకుండా గా పుట్టాడేమో, అందుకేనా మొన్న అసెబ్లీలో నెలతక్కువ వెధవ అని ఎవరో అన్నారు?

పవన్ కళ్యాణ్ అంతే సినిమాల్లో వుంటే ఎన్నో ఆస్కార్ అవార్డ్స్ వచ్చేవి - కొణతాల 

  ఈ మొహానికి  రెండు సుబ్బిరామి రెడ్డి అవార్డ్స్, ఒక సంతోషం అవార్డు ఉన్నాయి...నంది అవార్డే  నే ఔట్ ఆఫ్ క్వశ్చన్ అంటే ఆస్కార్ అంట..!

పవన్ కళ్యాణ్ .. దేశంలో మోడి తర్వాత అత్యంత ప్రజాదరణ వున్న నాయకుడు : పంతం నానాజి

 ఇది వింటే మోడీ bathtub లో కాదు, washbasin లో పడి ఆత్మహత్య చేసుకొంటాడేమో, అయినా మనకెందుకులే అది పువ్వు భక్తులు చూసుకొంటారు. 


 జనాల కామెంట్స్:

రేపు అమరావతి రీ రీ లాంఛ్ సభకు మోడీనీ పిలిచి ఆ రోజు అబ్బా కొడుకులు పంబన్ కళ్యాణం భజన ఎలా చేస్తారా అని వెయిటింగ్....  - ఓ బులుగు తమ్ముడు 

హా, ఏముంది ప్రమాణ స్వీకారం అప్పుడు... చిరుజీవి, పవన్కళ్యాణ్  లు మోడీ చేసిన  రీల్స్ వీడియో కి ఇప్పుడు  నాగబాబు కూడా  కలుస్తాడు ,  ఎర్రి పువ్వు  అబ్బా కొడుకులు... వాళ్ళని చూసి ముగ్గురు మొనగాళ్లు అంటూ ముసి ముసి నవ్వులు నవ్వుకుంటూ ఉంటారు, మనం చూస్తూ ఆనందించటమే ! - ఇంకో బులుగు తమ్ముడు 


సెంద్రబాబు గురించి:

మనం లేదంటాం, రేపు వీలు చూసుకుని పవన్ పెద్దమనసు చేసుకుని ఏమీ ఆశించకుండా మద్దతిచ్చి గెలిపించాడు అని వాళ్ళు చెబుతారు. మనం హౌలే గాళ్లం అవుతాం.  

మనం గొప్పగా ఉండటం అంటే మనం ఒక్కళ్ళమే గొప్పగా ఉండటం కాదు మన చుట్టూ ఉన్నోళ్లని వాళ్ల వాళ్ల స్థాయిల్లో గొప్పగా ఉంచడం కూడా అని ఆయనకి(చంద్రబాబు కు) గుర్తు రాదు. మనకి గుర్తున్నా పెద్దగా తేడా రాదు! - పచ్చ తమ్ముళ్లు 


 చరిత్ర గురించి. 

• 2009 లో చిరంజీవి రెండు చోట్ల పోటీ చేస్తే ఒక చోట గెలిచాడు 

• 2009 లో చిరంజీవి ఆత్మ గా చెప్పుకునే సొంత బావమరిది పోటీచేసి ఓటమి 

• 2012 లో చిరంజీవి సొంత పార్టీ కాంగ్రెస్లో విలీనం చేసి, తను 15 ఓట్లతో గెలిచిన తిరుపతిలో కాంగ్రెస్ అభ్యర్థిని నిలబెట్టి ప్రచారం చేస్తే 17 వేలతో ఓటమి

• 2019 పవన్ పోటీచేసిన రెండు చోట్లా ఓటమి

• 2019 నాగబాబు ఎంపీ గా ఓటమి

• 2024 లో టీడీపీ పొత్తుతో పవన్ ఎంఎల్ఏ.

— మనం టీడీపీని నిలబెట్టాం, పవన్ కళ్యాన్ 🙏 - ఓ స్టాటిస్టిక్స్ తమ్ముడు


నా ఆస్తిలో సగం, నా వియ్యంకుడు ఆస్తిలో సగం జగన్ మోహన్ రెడ్డి కాజేసాడు - బాలినేని

 అంటే, ఇప్పుడు చంద్రబాబు గారే న్యాయం చెయ్యాలి. .. పోయిన నా డబ్బు దోచుకోవడానికి నాకు ఒక్క అవకాశం ఇవ్వాలి ... అంతేగా 

అక్కడికి వీళ్ళ నాన్న ఏదో ఒంగోలు జమీందారు అన్నట్టు మా నాన్న ఇచ్చిన ఆస్తి అవజేసా అని ఊగిపోతూ చెబుతున్నాడు,  రాజశేఖరెడ్డి, జగన్ రెడ్డి లేకపోతే వీడు ఇప్పటికీ ఒంగోలు లో కిళ్లీ బంకుల దగ్గర సిగరెట్లు కు అడుక్కొంటూ తిరిగేవాడు.  - బులుగు తమ్ముళ్లు 

ఒక రెడ్డితో , ఇంకో రెడ్డి ని తిట్టిస్తూ స్టేజి మీదా ముగ్గురు కాపులు కాళ్ళు ఊపుకుంటావెకిలిగా నవ్వడం అసలేమీ బాగోలేదు  - బులుగు తమ్ముళ్లు 


 ఇలా ఒక కుటుంబంలో వాళ్ళని చీల్చి ఒకరితో ఒకరిని తిట్టిస్తూ, వెకిలిగా నవ్వుతూ కూర్చునే సంప్రదాయం వైఎస్ కుటుంబం చేసేది, ఇప్పుడు వీళ్ళు అందిపుచ్చుకున్నట్టున్నారు!  - న్యూట్రల్ తమ్ముళ్లు 


చివరాఖరగా నా కామెంట్: హనీమూన్ పీరియడ్ పూర్తిఅయినట్లేనా? లేక 2009 లో తెరాస పొత్తు తో తెదేపా బలమయిన స్థానాలు వాళ్లకు ధారపోసి, చివరకు తెలంగాణా లో నామరూపాలు లేకుండా పోవడానికి శంకుస్థాపన చేసుకొన్నట్లు ,  ఆంధ్రా లో కూడా తెదేపా తన ఆఖరి ప్రయాణానికి  శంకుస్థాపన చేసుకున్నారే మో  జనసేన పొత్తు తో,  కాలమే చెప్పాలి. 

ఏది ఏమయినా, స్నేక్ బాబు ఎంట్రీ తో, ఆయన నోటిదూలతో రాబోయే రోజులలో అంత సాఫీ గా మాత్రం జరగదు అని అనిపిస్తుంది. చూడాలి.... 

కొసమెరుపులు: ఎంత  తేలికగా తండ్రి ని తీసుకొచ్చి అలవోకగా అబద్దాలు ఆడుతున్నాడో ఈ వీడియో చూడండి. రాజకీయాలు అన్న తరువాత ఎంతో కొంత క్యాడర్ కోసం B.S. కొడుతారు కానీ, సొంత నాన్న పేరుతొ ఇలా  ఊసరవెల్లి విశ్వరూపం చూపనక్కర్లేదు అనుకొంటా.... 



ఇంకో ఊసరవెల్లి వీడియో compilation, ఈరోజు twitter lo ఓ ప్రక్క DMK, ఇంకో ప్రక్క తమ్ముళ్లు, ఇంకో ప్రక్క PayTm బ్యాచ్,  ... ఆపకుండా ఒకటే వాయింపు... ఈయన్ని ట్రోల్ చేసే వీడియో కి వేలలో లైక్స్,  ఇలానే వాగుతూ ఎదవ అవటం అవసరమా!  ఆఖరికి పాత ట్వీట్స్ డిలీట్ చేసుకోవాల్సిన ఖర్మ పట్టింది. 


హిందీ మీద  ఊసరవెల్లి మాటలు! 



మరికొన్ని videos& screenshots, 








2022 లోనే ఈయన కరెక్ట్ అయినా quote చెప్పాడు. 


మరికొన్ని  కామెంట్స్ SM లో:  





సరదాకి ఇవ్వాళ టెన్నిస్ ఆడుతున్నప్పుడు సంభాషణలు:

బులుగు మిత్రుడు:  అన్నదమ్ములిద్దరూ ఎలా మాట్లాడారో చూశావా!?
పచ్చ మిత్రుడు:  ఉంచుకున్నది ఓ మాట అన్నాసరే పట్టించుకోకూడదు రా..! అవసరం తీర్చేది అదే అని గుర్తెట్టుకోవాలి..!
న్యూట్రల్ మిత్రుడు: ఎవరు ఎవరిని ఉంచుకొన్నారో ముందు క్లారిటీ తెచ్చుకోండి, వెధవ సంత రోజూ చూడలేక సస్తున్నాం😏




Saturday, July 6, 2024

మహామేత, వెంకట్రామిరెడ్డి, APPSC, దాని పర్యవసానం!

మహా మేత జయంతి వస్తుంది, ఎదో ఒకటి చేయాలి/రాయాలి కాబట్టి ఆయన్ను స్తుతిస్తూ (క్రీస్తు సువార్త సభలలో కంటే ఎక్కువుగా)  మన ఎర్నలిస్టులు, PayTm బ్యాచ్ లు  ఎటూ హడావుడి చేస్తారు కాబట్టి, ఆ మహా మేత వ్యవస్థలను బ్రష్టు పట్టించటానికి ఎలా పునాదులు వేసాడో ఓ  మచ్చు తునక! 


Y.వెంకట్రామిరెడ్డి 1975 లో JNTU,Hyd లో లెక్చరర్ గా చేరాడు. 98లో సిబిన్ అతన్ని JNTU యంగెస్ట్ VC గా చేశారు.2005 వరకు రెండు సార్లు ఎక్టెన్షన్ ఇచ్చారు.కులం చూసి దూరం పెట్టడం ఆయనకు వైఎస్ఆర్ కి చేతయినంత గా చేతకాదు! తాను ఎన్నిక కాగానే  అతన్ని తీసుకువచ్చి మహా మేత  వైఎస్ఆర్ APPSC చైర్మన్ నీ చేశారు.2011,Aug వరకు అతనే చైర్మన్(62 ఏళ్లు వచ్చేవరకు).అతని సేవలు మెచ్చి కిరణ్ రెడ్డి UPSC  కి రికమెండ్ చేసాడు.అతను ఇంకో మూడేళ్లు(65 వచ్చేవరకు) యూపీఎస్సీ మెంబర్ గా వర్క్ చేసాడు!!

..

రాష్ట్ర APPSC చరిత్ర లో ఈ వెంకట్రామిరెడ్డి వెధవ చూపినంత కుల నెపోటిజం ఎవడూ చూపలేదు!

2004,2007, 2009,2011 గ్రూప్ 1, గ్రూప్ 2 పరీక్షలలో  లో O.C కేటగిరీ లో సెలెక్ట్  చేసిన  వారి పొస్ట్స్ బయటకు తీసి వారి " రిటన్ మార్క్స్, ఇంటర్వ్యూ మార్క్స్ " వెబ్సైట్ లో పెడితే వీడి కుల గజ్జి క్రిస్టల్ క్లియర్ గా కనబడుతుంది! 
దాదాపు 90% టాప్ కాడర్ పోస్ట్స్ అయిన " డిసి, డీఎస్పీ,సీటీఓ" పోస్టుల్లోని OC కేటగిరీలో సొంత సామాజిక వర్గం పేర్లే కనబడతాయి!!ఇంటర్వ్యూ  లో ఇచ్చే 90 మార్క్స్ కి వీడు వాడి కుల తోకలు ఉన్న వారికి  ఇచ్చిన  మార్క్స్ 84-89. ఆ బ్యాచ్ లో సెలెక్ట్ అయి పదోన్నతి పొందిన వారే పల్నాడు మాజీ ఎస్పీ రవిశంకర్ రెడ్డి, గుంటూరు కలెక్టర్ వేణుగోపాల రెడ్డి,మాధవి లతరెడ్డి,ఎస్పీ పనసారెడ్డి etc.(కొంతమంది రెడ్లు తెలంగాణ పోయారు.. ఎస్పీ అన్నపూర్ణ రెడ్డి,ఐఏఎస్ హేమలత రెడ్డీ Etc).

మహా మేత  వైఎస్ఆర్ & కో ఇన్ఫ్లుయెన్స్ తో  OC  లలో వ్రాత పరీక్షలో మార్క్స్ దగ్గర పెట్టుకుని మరీ ఎక్కువ మార్కులు వచ్చినవారికి వాళ్ళ కుల తోక లేకపోతె ఇంటర్వ్యూ లో అతితక్కువ అంటే 11-30 మార్క్స్ వేసి తొక్కి మరీ, తోక బ్యాచ్ నీ ముందుకు పట్టుకు వచ్చిన ఘనత ఈ కుల కుష్టు రెడ్డీ గాడిది!

RTI కింద లిస్ట్ అడిగినా కూడా 2009 వరకు పేర్లు లేకుండా నంబర్స్ తో మాత్రమే లిస్ట్ ఇచ్చిన ఘనుడు వాడు... తోక లు బయటపడతాయి అని. HC లో కేస్ లు వేస్తే అప్పటికే ట్రైనింగ్ కంప్లీట్ చేసి ఉద్యోగాల్లో చేరడంతో  పక్షపాతం కనబడుతోంది కానీ ఈ టైం లో రద్దు చేస్తే సంక్షోభం ఏర్పడుతుంది అని జడ్జిమెంట్ ఇచ్చింది.

బాధితుల క్షోభ కన్నా, బాధ కన్నా .. మోసం చేసి అడ్డదారి లో చేరిన వాళ్ళ హక్కులకి ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చే న్యాయ వ్యవస్థ మనది..ఏటి సేత్తామ్!! 2011లో ఇదే వెంకట్రామిరెడ్డి UPSC లో మెంబర్ అయ్యాడు కిరణ్ రెడ్డీ సిఫార్సు తో!!ఇంకా అక్కడ ఎంతమంది రెడ్ల కి వాడున్న 3 ఏళ్లలో  ఇంటర్వ్యూ లో మ్యానిపులేషన్ చేసి వ్యవస్థ లలోకి చొప్పించాడో!?

.. 

తర్వాత కిరణ్ రెడ్డీ హయాం లో జరిగిన గ్రూప్1పరీక్షల్లో  వచ్చిన ప్రొడక్ట్స్ నే మొన్న EC ట్రాన్స్ఫర్ చేసిన ఒంగోలు ఎస్పీ పరమేశ్వర రెడ్డీ, నెల్లూరు ఎస్పీ తిరుమలేశ్వర రెడ్డీ,రైతుల మీద దాడి చేసిన డీఎస్పీ మాధవరెడ్డి లు. 

వీళ్ళందరూ అడ్డదారి లో  నియామకాలు పొందినప్పుడు, అడ్డదిడ్డ మైన పనులు,అడ్డగోలు గా  చెయ్యక ఇంకేం చేస్తారు!? 

..

అప్పుడు సరైన చర్యలు తీసుకోకుండా  HC వదిలేయడంతో అదే సీన్స్ ఇప్పుడు రిపీట్ అయ్యాయి!!ఈసారి చైర్మన్ గా వున్న వ్యక్తి 2016 లో CBN  అపాయింట్ చేసిన prof.ఉదయ భాస్కర్ వుండడంతో తమ పనులకి ఎక్కడ అడ్డం పడతారో అని ఆయన్ని సైడ్ చేసేసారు. ఆఫీస్ రూమ్ కూడా తీయకుండా తాళాలు వేసుకునే వాళ్ళు.

వెంకట్రామిరెడ్డి పని సెక్రటరీ సీతారామాంజనేయులు తీసుకున్నాడు! కావలసిన వారికి ఇంటర్వ్యూ లో 75 కి 74.5 మార్క్స్ వేశారు! టాప్ పోస్ట్స్స్  అన్నీ ఇలా  కులకుష్టు రెడ్లతో నింపేసి తర్వాత వారిని అడ్డగోలు పనులకు వాడుకోవడం అలవాటై పోయింది!!

..

HC సింగిల్ జడ్జి రద్దు చేసిన పరీక్ష పై బెంచ్ stay ఇచ్చింది. ప్రతిపక్షం లో వున్నప్పుడు రద్దు చేయాలని PPP తో చెప్పిన CBN అధికారం లోకి వచ్చాక లోకేష్ నీ దీనిపై దృష్టి పెట్టమనకుండా పోలవరం,అమరావతి, పెట్టుబడులు అంటూ కలవరిస్తే  ఎలా!?   వ్యవస్థల విధ్వంసం చాప కింద నీరులా జరిగిపోతుంటే ఉపయోగం ఏముంది!?

పై మెసేజ్ వాట్సాప్ ఫార్వర్డ్ ద్వారా వచ్చినది



కొసమెరుపు: ఈ బాబూ కొడుకులు మాత్రం సచ్చినా మారరు,  ఆ రాక్షుడుని భరించలేక, వీళ్ళను మాకు  భరించటం తప్పదు అంటూ తెదేపా తమ్ముళ్లు నోట్లో వేళ్ళు కుక్కుకొని సౌండ్ లేకుండా బాధపడటం చూస్తూ ఉంటూ ఉంటె,  వైఛీపీ PayTm ఎడ్డి మంద పరిస్థితే బెట్టర్ అనిపిస్తుంది, కనీసం వాళ్ళు పబ్లిక్ గా నయినా ఏడవగలుగుతున్నారు 🤣

మనలో మనమాట, ఇంతకీ దొంగ చాకిరేవు బ్లాగర్ ఏమయ్యాడు, ఎన్నికల ఫలితాలు అప్పటినుండి  టపాలు లేవు, ఏమయినా తన హాస్య  టపా లు లేక మాలిక బోసిపోయినట్లు ఉంది😏

Monday, November 20, 2023

దొర గారి భక్తుల కోసం!

 "నీకు కాల్మొక్కుతా దొరా!" అనేది ఎంత సంపాదించుకున్నా, ఎంత చదువుకున్నా రక్తం లో జీర్ణించుకుపోయిన తెలంగాణా కవి గాయక  కళాకారులు జ్ఞానవంతులకోసం ఒక్కసారి గుర్తు చేద్దాం అని. 



కొసమెరుపు:  కులాల కంపే లేని తెలంగాణా లో  తెరాస 43 మంది (36%) రెడ్లకు, కాంగ్రెస్ 46 మంది(39%) రెడ్లకు ఇస్తే బిసిలను ముఖ్యమంత్రి చేసే బిజేపి 30 మంది (25%) రెడ్లకు ఇచ్చింది 😜😜