Wednesday, October 13, 2021

వినాశకాలే విపరీత బుద్ది

 



దీన్ని  గుళ్లో కూర్చోబెట్టేసి నెత్తి మీద   నూటొక్క  కొబ్బరికాయలు కొడితే సరి,  జలగన్నకు సరిపోయిన చిలకలూరిపేట స్పెషల్ బ్యాచ్. 

శామ్యూల్ రెడ్డి భక్తులు వేసుకోండి పాట  రా.జ., కా. జ. అని సాక్షి చదువుకుంటూ! 

Friday, September 24, 2021

జలగ నుండి సెంద్రబాబు నేర్చుకోవాలని చెప్పే భక్తులకోసం!

సాయంత్రం అవగానే సాక్షి పేపర్ కోసం ఎదురు చూసే నా NRI మిత్రులు కు నచ్చే వార్త. 

బ్రాహ్మణ కార్పొరేషన్ తీసికెళ్ళి బీసీ కార్పొరేషన్ లో కలపటం.  ఇప్పుడే కంటపడింది. 

 గుంటూరు, సెప్టెంబరు 24: బ్రాహ్మణ కార్పొరేషన్‌ను సైద్ధాంతిక విరుద్ధ భావాలు గల బీసీ కార్పొరేషన్‌లో కలపటాన్ని బ్రాహ్మణ చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు శిరిపురపు శ్రీధర్‌ తీవ్రంగా ఖండిచారు. ఈ మేరకు శుక్రవారం గుంటూరులోని బ్రాడీపేటలో గల కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ బ్రాహ్మణ వెల్ఫేర్‌ కార్పొరేషన్‌ను బీసీ వెల్ఫేర్‌ కార్పొరేషన్‌లో విలీనం చేస్తూ జారీ చేసిన జీవోను తక్షణం నిలిపివేయాలని డిమాండ్‌ చేశారు. దీని కారణంగా రాష్ట్రంలోని 75 లక్షల బ్రాహ్మణ జనాభా ఆందోళన చెందుతుందన్నారు. దేశంలో ఎక్కడాలేని విధంగా గత ముఖ్యమంత్రి చంద్రబాబు తన పాదయాత్రలో బ్రాహ్మణ సంఘాలకు ఇచ్చిన హామీ మేరకు 2016లో బ్రాహ్మణ వేల్ఫేర్‌ కార్పొరేషన్‌ ఏర్పాటు చేసి దాని ద్వారా రాష్ట్రంలోని 13 జిల్లాల్లో గల పేద, మధ్య తరగతి బ్రాహ్మణ కుటుంబాలకు ఆరు పథకాల ద్వారా రూ.310 కోట్లు ఖర్చు చేశారన్నారు. అయితే అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం దానిని కొనసాగించకుండా, నిధులు కేటాయించకుండా బ్రహ్మాణ కార్పొరేషన్‌ను నిర్వీర్యం చేస్తుందన్నారు. ఇప్పుడు పుండు మీద కారం చల్లినట్టు బ్రాహ్మణ కార్పొరేషన్‌ను బీసీ కార్పొరేషన్‌లో కలిపి యావత్‌ బ్రాహ్మణ సమాజాన్ని అన్యాయం, మోసం చేయటమేకాక అవమానానికి గురి చేసిందన్నారు. వైసీపీ ప్రభుత్వం ఇటీవల కొత్తగా కమ్మ, రెడ్డి, వెలమ, రాజు కార్పొరేషన్లను ఏర్పాటు చేసిందని, మరి వాటిని బీసీ కార్పొరేషన్‌లో ఎందుకు విలీనం చేయలేదని ప్రశ్నించారు. అగ్రవర్ణాలంటే కేవలం బ్రాహ్మణ జాతికి మాత్రమే వర్తిస్తుందా అని ప్రశ్నించారు. అగ్రవర్ణాలైన కాపు, కమ్మ, రెడ్డి, వెలమ, రాజు, ఆర్యవైశ్య కార్పొరేషన్‌లను కూడా బీసీ వెల్ఫేర్‌ కార్పొరేషన్‌లో తక్షణం విలీనం చేస్తూ జీవో జారీ చేయాలని డిమాండ్‌ చేశారు. లేని పక్షంలో దేవదాయ శాఖ పరిధిలో గత ప్రభుత్వం ఎంచుకున్న బ్రాహ్మణ వెల్ఫేర్‌ కార్పొరేషన్‌ను యధావిధిగా కొనసాగించాలని డిమాండ్‌ చేశారు. గత టీడీపీ ప్రభుత్వం దూరదృష్టితో బ్రాహ్మణులకు, దేవలయాలకు అవినావభావ సంబంధం ఉందనే ఉద్దేశంతో రాష్ట్ర విభజన నేపథ్యంలో విజయవాడలోని దేవదాయ శాఖ కమిషనర్‌ కార్యాలయ ప్రాంగణంలో కొంతస్థలాన్ని బ్రాహ్మణ కార్పొరేషన్‌కు కేటాయించి భవనాన్ని నిర్మించిందన్నారు. సొంత భవనం ఉంటే అందులో కార్యకలాపాలు చేయకుండా కొంతమంది అధికారులు సీఎం జగన్‌ను తప్పుదోవ పట్టించే విధంగా జీవో ఇచ్చినట్లయితే వెంటనే వైసీపీ నాయకులు, మత పెద్దలు దీనిపై పునరాలోచన చేయాలన్నారు. లేని పక్షంలో ప్రబుత్వం బ్రాహ్మణ జాతి తిరుగుబాటు చవిచూడాల్సి వస్తుందని హెచ్చరించారు. మల్లాది విష్ణు, కోనా రఘుపతి వైసీపీ ఎమ్మెల్యేలుగా ఉన్నారని, వీరుకాక మరో పది, 15 మంది బ్రాహ్మణ వర్గానికి చెందిన వారు ప్రభుత్వ సలహాదారులుగా కొనసాగుతున్నారని, ఈ క మ్రంలో వారంతా ఈ జీవో రద్దు చేయించకుంటే భారీ మూల్యం చెల్లించుకోకతప్పదని హెచ్చరించారు. గత ఎన్నికలకు ముందు తాము అధికారంలోకి వస్తే బ్రాహ్మణ కార్పొరేషన్‌కు చట్టబద్దత కల్పిస్తామని జగన్‌ ఊరూరు తిరిగి డాంబికాలు పలికారన్నారు. అయితే ఇప్పుడు 103 జీవోపై ఆయన ఏం సమాధానం ఇస్తారని ప్రశ్నించారు. తక్షణం ఆ జీవోను ఉపసంహరించుకోకుంటే 13 జిల్లాల నుంచి పెద్దసంఖ్యలో బ్రాహ్మణులు తిరుగుబాటుకు సిద్ధంగా ఉన్నారన్నారు.

ఇప్పుడు పాడండి రా. జ. , కా. జ. అని. ఎలా పాడాలో , ఏ రాగం లో పాడాలో తెలియకపోతే  ఊసరవెల్లి ఉండవల్లి నో, లేకపోతె గుంట నక్క IVR దగ్గరో  కోచింగ్ తీసుకొని మరీ పాడవచ్చు. 

నాకయితే  మనందరికీ తెలిసిన అత్యంత న్యూట్రల్ జర్నలిస్ట్ భండారు గారు దీనిమీద ఓ టపా ఎలా ఎండాకాలం చలివేంద్రాలలో పోసే మజ్జిగ అంత పలచగా అంటిముట్టనట్టుగా వ్రాస్తారో చూడాలని మహా ముచ్చట గా ఉంది 😉

Karma is Beech అని పెద్దలు ఊరకనే అన్నారా? ఎరుకులసందు శామ్యూల్ రెడ్డి కనీసం ఇంకో రెండు terms గెలవాలనే కోరుకొంటున్నా, అందరి దురద బాగా తీర్చటానికి 🤣🤣

Wednesday, March 24, 2021

న్యూట్రల్ ముసుగులు వేసుకొన్న ఎర్నలిస్టు ల కోసం

పాపం చాలా మంచి వారు, అప్పుడప్పుడు చంద్రబాబు గారు జగన్ గారి దగ్గరనుండి చాలా (అవి ఏవి అని నన్ను అడగకండి) నేర్చుకోవటం లేదని  బాధ పడే  మన భండారు గారిని అన్నారు గాని ఆ రెడ్డివారి గారు (ఆ పోస్ట్ లింక్ మఱియు దాని కంటెంట్ క్రిందన) , నిజానికి ఇది న్యూట్రల్ ముసుగులు వేసుకొన్న ప్రతి ఎర్నలిస్టు లకు సారీ జర్నలిస్ట్ లకు వర్తిస్తుంది.  


బండారు గారు ,
  మిమ్మల్లి చాలా మంది #యేసురెడ్డి ఫామిలీ సపోర్టర్ అంటే నేను నమ్మలేదు .ఆ దిశగా రాతలు ఉన్న ఏమోలే ఎక్కడో చంద్రబాబు మీద అక్కసుతో యేసు రెడ్డి ఫామిలీ ని మోస్తున్నాడేమో అనుకొన్న ..
#సాక్షి మాతృ సంస్థగా ఉన్న IDREAMS తో మీకున్న అనుబంధాలు ,పరిచయాలు అందరికి తెలిసిందే .
ఇంకా 23 స్టోరీ కి వద్దాం ..
మీకు 23 అంటే ఎందుకు అంత అవహేళన ??
అదే 23 నాడు ..అదే మంగళవారం నాడు ...కేంద్రం #ఏపీ కి స్పెషల్ స్టేటస్ ముగిసిన అధ్యయనం అంటే మీకు మీ యేసు రెడ్డి చెప్పిన మెడలు వంచే కార్యక్రమం గుర్తుకు రాలేదా ??

మీరు #జగన్ మాట తప్పడం,ప్రజలను మోసం చేయడం పైన .... #ఏపీ సొసైటీ అవసరాలు గుర్తుకు తెచ్చుకొని మంచి ఆర్టికల్ రాసి మీ సంస్థ IDREAMS లో వచ్చేట్టు చేస్తారేమో అని ఆశపడ్డాము .
#న్యూట్రల్ లేదా మేధావులు సొసైటీ కి ఉపయోగపడాలి,సొసైటీ ని నిద్ర లేపాలి ...కానీ భారం కాకూడదు ..
మొన్న #చంద్రబాబు హయం లో పెట్టిన బ్రాహ్మణ కార్పొరేషన్ గూర్చి గొప్పగా చెప్తూ ,మొత్తం క్రెడిట్ అపుడు చైర్మన్ గా ఉన్న IYR కృష్ణ రావు గారిదే అన్నపుడే మీలో ఉన్న సంకుచిత భావం అర్థమైంది .

#హిందూ సమాజం లో సద్బ్రాహ్మణులుగా చెప్పుకొంటున్న ,ఉన్నత స్థానాలలో ఉన్న వారు  హిందూ సమాజానికి చీడపురుగులా తయారైన స్వామిజీలతో సహా అందరూ క్రిస్టియన్ ఐన యేసురెడ్డి కాళ్ళ కింద పనిచేయడం ఏమిటో ..
సరే 50 లక్షలకే అంత అవహేళన చేస్తే మరి CBI ,ED కేసుల్లో 43000 వేల కోట్లు అవినీతి ,దోపిడీదారుడు మీకు సమ్మగా కనపడుతున్నాడా ??

చివరగా మీకు #payment చేసేంత డబ్బు చంద్రబాబు గారికి లేకపోవచ్చు ...కానీ #ఏపీ సొసైటీ ని డెవలప్ చేసేంత శక్తీ ,సామర్త్యలు ,ప్రణాళిక ,పట్టుదల ,చిత్తశుద్ధి ,పారదర్శకత చంద్రబాబు గారిలో ఉన్నాయని ఆయన రాజకీయ జీవితం చెప్తున్నది .


 



సరే  బండారు గారి న్యూట్రాలిటీ  జగమెరిగిన ఎటూ తెలిసిన యవ్వారమే కాబట్టి దాన్ని వదిలేసి 
క్రింద న్యూస్ చూడండి ఆంధ్రభూమి వాళ్ళ మీద. 


 మీడియా హౌస్ పెట్టడం, దాని మీద లోన్లు, టాక్స్ ఇన్సెంటివ్ లు కొట్టేయడం, గుట్టుచప్పుడు కాకుండా మూసేయడం, మళ్లీ పక్క పేపర్లు కుట్రలు చేసాయని కులాల మీద ఏడవడం... చేసే వాళ్ళ బ్రతుకుల మీద  మాట్లాడటానికి ,

so called  మీడియా కబుర్లు అంటూ పత్తిత్తి కబుర్లు చెప్పే బ్యాచికి ఎందుకు నోరు రావటం లేదు.  ఇదే బ్యాచ్   జర్నలిజం స్కూల్లో సీట్లు ఇచ్చి ఉద్యోగం ఇచ్చి కాస్తో కూస్తో పని నేర్పితే,  వాళ్ళ మీద ఏడవటానికి మాత్రం ముందు ఉంటారు😡

ఇక సీనియర్ జర్నలిస్ట్ ముసుగులేసుకొన్న ముసలి మేతావులు అయితే, 
వికే రిజైన్ చేయ్యడాన్ని అడ్డం పెట్టుకుని జ్యోతి మీద వెకిలి ఏడుపులు ఏడ్చి మానసిక స్వయంతృప్తి పొందటానికి రెడీ కాని,  సంవత్సరం నుంచి జీతాలు లేక రోడ్డున పడి కనిపించినోళ్ళందరికీ గోడు వెళ్లబోసుకుంటున్న ఆంధ్రభూమి సిబ్బంది గురించి ఒక మాటైనా చెప్పారా?? లేకపోతే ‘వాళ్ల’ గనుల్లో దొరికే డబ్బులో చిల్లర రాలుస్తారని గడప ముందు నాలుక చాపి కాపలా కాస్తున్నారో?


ముందు జర్నలిస్ట్ లమని చెప్పుకొంటూ మాకు మా వృత్తికి గౌరవం లేదని ఏడ్చే బదులు ముందు వీళ్ళ  న్యూట్రాలిటీ చెక్ చేసుకొని, తమ క్రింద నలుపులు  చూసుకొని  ఆ  చెప్పే పత్తిత్తు కబుర్లు చెబితే బాగుంటుందేమో. 

Thursday, October 1, 2020

మరో మహాత్ముడు!

సాచ్చి పేపర్ కోసం ఎపుడు తెలారుతుందా (సారీ ఎపుడు సాయంత్రం అవుతుందా) అని ఎదురుచూసే మిత్రుల కోసం ఓ జ్ఞాన గుళిక 😉 already చూసి స్వరూపానంద ను మించి హోమాలు గట్రా, లేకపోతె విష్ణు సహస్ర నామావళి జపిస్తూ  ఉండే  ఉంటారు🤣




కొసమెరుపు: ఒక ఊరెరిగిన అహింసావాది, ఓ దేశమెరిగిన అహింసావాదిని ఆ మహాత్ముడితో పోలుస్తూ ఓ గొప్ప కావ్యాన్ని, నిజాయితీగా  కష్టపడి సంపాదించిన సొమ్ముతో పెట్టిన ఓ పేపర్ లో వ్రాయటం!  



Wednesday, September 23, 2020

ఆంధ్రరాష్ట్రం లో హిందూ మతం మీద హడావుడి


ముందుగా క్రిష్టియన్ మతం పట్టుకొన్న వాడు, వాడి బాబాయిని (వాళ్ళావిడ అఫీషియల్ గా క్రిస్టియన్, అతను  సగం సగం) ఏకంగా TTD చైర్మన్ చేయటం తప్పు.  

చేసేడే పో, వాడు ఇష్టమొచ్చినట్లు స్టేట్మెంట్ లు ఇవ్వటం ఇంకో తప్పు. 

వాడిని సప్పోర్ట్ చేయటానికి ఇంకో తాగుబోతు మంత్రి తో  (అందరూ తాగుబోతులు కాదా అంటారేమో, వీడి కున్న  స్పెషల్ క్వాలిఫికేషన్  ఏమిటి అంటే ఆంబోతు రాంబాబో, దబారా నీళ్ల మంత్రి లాగో బూతులు తిట్టటం లో PhD చేయటం తో పాటు,  వైరి కులానికి చెందటం)  ఇష్టం వచ్చినట్లు మాట్లాడించటం.   

సరే ఆ తాగుబోతు వెధవ, వాడి బాసు ఎరుకులసందు శామ్యూల్ రెడ్డి గాడు చెప్పినట్లు వాగాడే అనుకొందాం కాసేపు,  మరి ఈ క్రింద బ్యాచ్ అంతా ఏమయినట్లు?  ఇదే శామ్యూల్  రెడ్డి ప్రభుత్వం కాకుండా, వేరే ప్రభుత్వం అయితే దండాలు, కమండలాలు పట్టుకొని, అజెండా లు భుజాన వేసుకొని ఊసరవెల్లి గాళ్ళు లాగా  దిగిపోయేవాళ్లు కాదా.  



సరే భజన చేయటం అలవాటయిన బ్యాచ్, శామ్యూల్ రెడ్డి కు  భజన చేసుకొంటూ ఉండటం లో బిజీ అనుకొందాం.  

పైన కండువా వేసుకొని, మేధావుల సంఘం అధ్యక్షుడును అంటూ తిరిగే మేతావులు,  జమానా లో సినెమాలు  తీసి నెత్తిన కండువా వేసుకొని, ఇప్పటికీ నేను ఉన్నాను అంటూ ఎగేసుకొని వచ్చే  తంతెరెడ్డి భరద్వాజలు,  పంచె కట్టుకొని పైరవీలు చేసుకొంటూ బతికే బండగడ్డ లక్షీ"ప్రసాదు" లు గట్రా ఎక్కడ సచ్చినట్లు? 




సరే వాళ్ళందరిని వదిలేస్తాం, న్యూట్రల్ ముసుగేసుకుని ఉండే  జాణలిస్టులు కు ఏ మాయదారి రోగం వచ్చింది.   ‘గోపీ సారా’, ‘పలకనల్లి రవి’, ‘జేబులచిల్లి  అమర్’ లాంటి వాళ్ళ కు. ఇలాంటి దిక్కుమాలిన మాటలు వేరే ప్రభుత్వం దగ్గర జరిగితే పొలోమని పతివ్రతా ఏడుపులు ఏడుస్తూ దిగిపోయేవారుకాదా? 

అంతెందుకు, 1970 నుండి జర్నలిజం లో ఉండి,  ఎన్నో చూసి, మన బ్లాగులలో కూడా ఉన్న జర్నలిస్ట్ లకు ఏమయ్యింది? నోట్లో జిల్లేళ్ళ మొక్కలు మొలిచాయా మీరు పుట్టిన హైందవం మీద మీరు సప్పోర్ట్ చేసిన వాడు దాడి చేస్తూ ఇష్టమొచ్చినట్లు  తన కూలి గాళ్ళతో తిట్టిస్తుంటే,  కనీసం ఇది తప్పు అని చెప్పటానికి కూడా ధైర్యం లేకపోతె ఎలా? ఇంకెన్నాళ్లు బతుకుతారు? బ్రతికే కొద్దిరోజులకు ఇంత దిగజారి బతకాలా? 

ఒక ప్రక్క మనం పుట్టిన రాష్ట్రం లో, మన మతం మీద దాడి జరుగుతుంటే,  సమయం లో  మనకు  స్వరభాస్కర్ గురించో, తాప్సి ల గురించో కావాలి.  మళ్ళీ మతం ధర్మం అంటూ హోమాలు గట్రాలు.  తప్పు ను తప్పు అని చెప్ప లేనంత దిగజారాల్సిన అవసరం ఏముంది?  ఓ పార్టీ మీదో, కులం మీదో ద్వేషం తో, మన ధర్మానికి ఎసరు పెడుతూ ఉంటే నిమ్మకు నీరెత్తినట్లు కూర్చోవటం లో అర్ధం ఏమయినా ఉందా?  

ఇంకొందరి కవరింగ్ అయితే ఏకంగా ఆ గడ్డం తాగుబొతోడితే తప్పు, వాడితో మాట్లాడిస్తున్న ఏరుకులసందు శామ్యూల్ రెడ్డి  పత్తిత్తు అని.  హవ్వ నవ్వి పోతారు అన్న సిగ్గులు జనాలు ఎప్పుడో వదిలేసినట్లున్నారు 

సరే ఇక  సాచ్చి వాడయితే ఓ ప్రక్క రథాలు తగలడతా ఉంటె, విగ్రహాలను విరగ్గొడతా ఉంటె, గుళ్ళలో సింహాలు మాయమవుతాయి ఉంటె, ఏకంగా  బిలినీయర్ బాబాలు అంటూ వెధవ ఏడుపులుతో ఆర్టికల్! 


సాక్షిపత్రిక వారు సాధువుల మీద దృష్టి పెట్టే కంటే బిలియనీర్  పాస్టర్లు  అని టైటిల్ పెడితే బ్రదర్_అనీల్ గారి స్థానం ఎక్కడో తెలిసేది కదా ...

తప్పు చేసిన వారు ప్రతీ మతంలోనూ ఉన్నారు..అలాంటి వారి ఫొటోల నడుమ మంచి వారి ఫొటోలు పెట్టి సమాజం సేవ చేస్తున్న
సద్గురు_జగ్గీవాసుదేవ్, రాందేవ్బాబా, శ్రీశ్రీరవిశంకర్, మాతాఆనందమయి లాంటి వారికి చెడ్డ పేరు తెచ్చేలా ఏకవచన సంబోధన చేయడం ఏమిటి? 

క్రైస్తవ మతములో కూడా అనేకమంది పాస్టర్లు లైంగిక దాడులు పాల్పడి కోట్లకి పడగెత్తారు. 
స్వస్థత ప్రార్థనల పేరిట అనేక మందిని అమాయకులను చేసి నిస్సిగ్గుగా ధనం సంపాదించే వారు లేరా వీళ్ళ కిరస్తానీ  మతంలో?

అంతర్వేది ఘటనపై,విజయవాడ ఘటనపై హిందూ సమాజం ఏకమవుతున్న సమయంలో ఓర్వలేని తనంతో ఇటువంటి నీచ రాజకీయాలు చేయడం .....

బ్లాగులలో నేను సాక్షి మాత్రమే చదువుతాను అని ఎక్సట్రా లు పోయిన మేతావులు ఏటంటారో ఇప్పుడు? వాళ్ళ శ్యామూల్ రెడ్డి కి స్వస్థత కూటములు లో భాగంగా హోమాలు చేస్తారా?

లేక క్రింద ప్రశ్నలు అడుగుతారా?



                                                                                                                                                                                                    ఎందుకు డిక్లరేషన్ మీద సంతకం పెట్టాలి? ఆ సంప్రదాయం ఎప్పటినుండి ఉంది అని ఎరుకులసందు కల్తీ రెడ్డి అడిగిస్తున్న మాటలు ఇవిగో   





ఇంకానయం, గుళ్లో కి చెప్పులు వేసుకెళ్ల కూడదని రూల్ పెట్టింది ఎవరు? ఎందుకు పెట్టారు? చర్చులకు వేసుకెళ్తున్నప్పుడు గూళ్ళల్లోకి ఎందుకు వేసుకెళ్లకూడదు, అని అడిగించలేదు లండీకొడుకు. 

సరే ఎటూ అడిగాడు కాబట్టి, 1890 లో విలియం కెయిన్ అనే బ్రిటీష్ పొలిటీషియన్, బాప్టిస్ట్ క్రైస్తవుడు రాసిన పుస్తకంవ్రాసిన పుస్తకం లోనే బ్రిటీషర్ ఒకరు ఏమన్నారో చూడండి. 




ఈ పుస్తకంలో రచయిత కెయిన్ పేజీ నంబర్ 488-489 లో తిరుపతి గురించి వివరిస్తూ 14,000 మంది జనాభా ఉండేవారని, యూరోపియన్లు తిరుమలను 'అప్పర్ తిరుపతి' అని పిలిచేవారని రాశాడు. తిరుమల దేవాలయంలోకి మహమ్మదీయుల్ని, క్రైస్తవుల్ని అనుమతించరని రాశాడు. ఒకవేళ దర్శించాలనుకుంటే తిరుపతి జిల్లా మేజిస్ట్రేటుకిగానీ, నార్త్ ఆర్కాట్ జిల్లా కలెక్టరుకిగానీ ముందే తెలియజేయాలని రాశాడు. ఈ విషయం అతను చెబుతున్నది ఇంగ్లండునుండి వస్తున్న (క్రైస్తవ) యాత్రికులకు.
అంటే తమ బ్రిటీష్ ప్రభుత్వ పాలనలోనే ఉన్న తిరుమలలో పాటించే మతపరమైన కట్టుబాట్లు, నియమాలు, ఆచారాలను ప్రస్తావిస్తూ, ఒకవేళ మీరు వెళ్ళాలి అనుకుంటే ప్రొసీజర్ అనుసరించి వెళ్ళండి అని ఒక బ్రిటీష్ క్రైస్తవుడే స్వయంగా చెబుతున్నాడు. పైగా తిరుపతి జిల్లా మేజిస్ట్రేట్, నార్త్ ఆర్కాట్ జిల్లా కలెక్టర్ కూడా బ్రిటీష్ క్రైస్తవులే అయి ఉంటారు. అయినా ప్రొసీజర్ ప్రకారం వారికి కబురు తెలియజేసి వెళ్ళమంటున్నాడు.
నూటముప్పయి ఏళ్ళ కిందట, బ్రిటీష్ పాలనలోనే తిరుమల ఆచారాలను గౌరవిస్తే, ఇప్పుడేం మాయరోగం వచ్చింది ? అంతమాత్రం సహనం, సర్దుబాటు, పరస్పర గౌరవం ఇచ్చుకోలేనంత జబ్బేం చేసింది ?



కొసమెరుపులు:
1. మొన్న ఆదివారం టెన్నిస్ చాలా కాలం తరువాత, చిన్నప్పటి సావాసగాళ్ళతో ఆడుతూ ఉంటే, అందులో ఒకడు ఎరా ఏంటి మీ (కులపోడు) వోడు అలా వాగుతున్నాడు... మీ వాళ్ళకి వెరీ బాడ్ నేమ్ అలాంటి వెధవల వల్ల అన్నాడు...,
ఆ రెండో వాడు, ఒకడి వల్ల పెరిగే పొజిషన్ లోనో తగ్గే పొజిషన్ లో ఎవరు (ఏ కులస్తులు) ఉండర్రా ... గుళ్లలో దేవుణ్ణి చూపించి బలవంతంగా దక్షిణ అడగటం, లేదా వసూల్ చెయ్యటం చూపించి అందరూ అంతే అంటే.... మీ (కులపోళ్ళకు) వాళ్ళ అందరికీ సిగ్గే కదరా అన్నాడు....
అందరం సరదాగా నవ్వేసుకున్నాం, సరదాకి అయినా, కులం ఎంత చొచ్చుకు వచ్చిందా అని మాత్రం అనిపించింది ఒక్క క్షణం.

2. అసలు ఏమీ లేనిదానికి, వైవీ సుబ్బారెడ్డి తో కావాలని కెలికించి, దానికి వత్తాసుగా తాగుబొతోడితొ వాగించి, సందులో సందుగా వంద జాకీలు వేసినా ఆంధ్రా లో లెగవలేని కాషాయం పార్టీకి సెలైన్ బాటిల్ ఎక్కిద్దామనే ప్రయత్నం ఏమో ఇది అని జనాల అనుమానం, ఎందుకంటే ఇంత జరుగుతున్నప్పటికీ, ఆ పార్టీ అధ్యక్షుడు సారా వీర్రాజు గోరు, ఇప్పటికీ ప్రధాన ప్రతిపక్షాన్నే ప్రధానం గా తిడుతూ ఉంటే, ఇదేదో స్కెచ్ లో భాగమని అనుమానమొస్తుంది అని కనీసం 5,6 గురు మిత్రులు అన్నారు.

3. కాస్తో కూస్తో రాజకీయాలలో తల పండి, ఉన్న వెంట్రుకలు కూడా రాల్చేసుకొన్న ఓ ప్రత్యక్ష బిజెపి/ పరోక్ష వైస్సార్సీపీ సప్పోర్ట్ చేసే మిత్రుడు అయితే, పార్లమెంట్ సెషన్ లు జరుగుతున్నాయి, నాలుగేళ్లు ప్రత్యేక హోదా, ప్రత్యేక హోదా అని హడావుడి చేసి, ఇప్పుడు తీరా అధికారం వచ్చినాక కనీసం పార్లమెంట్ లో ఎత్తనయినా ఎత్తలేదేమిటి అన్న మాట కూడా లేకుండా, మా వోడు (జగన్ రెడ్డి) బాగా డైవర్ట్ చేసాడబ్బా అంటూ మురిసిపోతున్నాడు 😊, అతన్ని అదంతా సరే డైవర్ట్ చేయటానికి హిందూ మతం, వెంకన్నే కావాల్సి వచ్చాడా అంటే సమాధానం లేదు.

చూద్దాం ఇందులో ఎవరి భాగం ఉన్నా, ఆ హెలికాప్టారమ్మ త్యాగం లాంటి, ఇంకో త్యాగం జరగకపోతుందా.

ఈ లోపు నాలో నేను చిన్న మేత పుస్తకం వస్తుంది అంట, నేను కూడా జాణలిస్ట్ లు లాగా కళ్ళలో వొత్తులు వేసుకొని ఎదురు చూస్తూ ఉంటా మరి.

పై ముక్కలు కొన్ని, ఫోటో లు కొట్టుకొచ్చినవి. Here are some of the source links.
https://www.facebook.com/kc.chekuri.50/posts/330897601570957

Saturday, September 19, 2020

గోదారోళ్ల వెటకారానికి పరాకాష్ట 😉

తోటలు తగలేయటం   లో అనుభవజ్ఞుడయిన ఓ జఫ్ఫా  ఎంపీ గారు, తోలు తీస్తాను అదీ ఇదీ అంటూ రాజు గారి మీద  పార్లమెంట్ దగ్గర ఎదో కూస్తే,  దాని మీద రాజు గారి వెటకారం ఈ వీడియో 


ఇందులో వెటకారం అర్ధం కావాలంటే, ఆ సదరు పార్లమెంట్ మెంబెర్ కూసిన కూతలు తోనే ఆయన కుల వృత్తిని  లింక్  చేయటం.  


కొసమెరుపు: ఓ గో.జి. మిత్రుడి తో ఎంతయినా మీ వెటకారాలు సామాన్యం కాదయ్యా అని ఈ వీడియో చూపిస్తే,  
నవ్వేసి  ఆ పార్లమెంట్ మెంబెర్ ఎవడి కనుసన్నలలో పని చేస్తున్నాడో,  ఆ ఎరుకుల సందు వాని గురించి కూడా,   పనిలోపని గా  నీ తాత పందులు, ఎలుకలు పట్టుకుని తోలు తీసి తెల్లోళ్ళకు అమ్మేవాడు అనే అర్దం కూడా వచ్చేటట్లు గా నేమో అని  నా అనుమానం  అన్నాడు 😀



Thursday, August 20, 2020

ఎవడిది కులగజ్జి..!?

ఎవడిది కులగజ్జి..!? అంటూ మిత్రుడు నవీన్ ముఖపుస్తకం గోడ మీద ఇవ్వాళ అడిగిన ప్రశ్నలు. 

ఇటీవలే వరసగా జరిగిన కొన్ని సంఘటనల్ని పరిశీలిస్తే...

మే 7, 2020: ఈ దశాబ్దానికే డెడ్లిఎస్ట్ పేలుడు అనదగిన LG Polymers కేసులో "సురుకంటి రవీందర్ రెడ్డి"ని అరెస్టు చేసారా ఇంతవరకు!?

జూన్ 27, 2020: SPY Agro Industries ఆమోనియా గాస్ లీక్ కేసులో "సజ్జల శ్రీధర్ రెడ్డి"ని అరెస్ట్ చేశారా!?

జూన్ 29, 2020: Sainor Life Sciences బెంజీన్ గాస్ లీక్ కేసులో "కోటి రెడ్డి, బ్రహ్మా రెడ్డి"ని!?

జులై 13, 2020: రాంకీ సాల్వెంట్స్ పేలుడు కేసులో "అయోధ్య రామి రెడ్డి"ని!?

చరిత్ర కూడా కొంచెం తరచి చూస్తే...

ఏప్రిల్ 22, 2014: సరైన ఆధారాలు లేవు అనే కారణంగా జస్టిస్ L. నరసింహా రెడ్డి, ఆగస్ట్ 6 1991 నాటి చుండూరు దళితుల ఊచకోత కేసులో "మల్లిఖార్జున రెడ్డి" సహా 21 మంది లైఫ్ సెంటెన్సీలు, మరో 35 ఖైదీలని విడిచి పెట్టారు. ఈరోజుకీ ఒక్కళ్ళు జైల్లో లేరు, దళితులు నోరు విప్పటానికి వెనకాడతారు!

ఆగస్టు 15, 2008: "గౌరు వెంకట్ రెడ్డి" అనే, సెప్టెంబర్ 19, 1995 నాటి తెలుగుదేశం లీడర్ల జంట హత్య కేసులో శిక్ష అనుభవిస్తున్న ఖైదీని "కనికరించి క్షమాభిక్ష" పెట్టి రిలీజ్ చేసింది వైయెస్ రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వం!

పై సంఘటనల్లో ఎక్కడా వీళ్ళకి కులరంగు కనపడదు గానీ... కులమత ప్రాంతీయ భావాలకి అతీతంగా పనిచేసి, దాదాపు 10,00,000 గుండె జబ్బు కేసుల్లో, 99% మించి సక్సెస్ రేట్ తో, ట్రీట్మెంట్స్ నిర్వహించిన ప్రముఖ కోస్తాంధ్ర డాక్టర్ గారి పేరుకి లేని "చౌదరి తోక" తగిలించి, ఒక ప్రమాద ఘటనకి బాద్యుడ్ని చేసి, సంబంధం లేని ఇంకొందరు డాక్టర్లని మీడియా రొచ్చులోకి లాగి పరువు తీసి, మొత్తంగా ఒక కులానికి అపకీర్తి ఆపాదించాలని చూస్తున్నారే ఈ పేటీఎం కులవర్కర్లు.. జనాలు ఎర్రి గొఱ్ఱెల్లా చూస్తూ కూర్చుంటారు అని భ్రమపడుతున్నారేమో!


#WeSupportDoctorRamesh